DEVOTIONALTELANGANA
కాకరకాయల మాలల అలంకరణలో శ్రీ దుర్గాభవాని అమ్మవారు

కాకర కాయల మాలల అలంకరణలో శ్రీదుర్గాభవానీ అమ్మవారు
కరీంనగర్ యువతరం ప్రతినిధి:
కరీంనగర్ మండలం నగునూర్లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యలో జరుగుతున్న ఆషాడమాసం శాఖాంబరీ ఉత్సవాలలో భాగంగా శనివారం శ్రీదుర్గాభవానీ అమ్మవారిని కాకర కాయల మాలలతో అలంకరించారు. ఆలయ పూజారులు అమ్మవారికి విశేష హారతులిచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతోపాటు భక్తులు పాల్గోన్నారు.