రూ.20ల వెల్ఫేర్ స్టాంపును వెంటనే రద్దు చేయాలి

రూ.20 ల వెల్ఫేర్ స్టాంపును వెంటనే రద్దు చేయాలి.
( యువతరం నవంబర్ 2 పత్తికొండ ప్రతినిధి):
ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ అనాలోచితంగా పెంచిన రూ: 20/- వెల్పేర్ స్టాంపును తక్షణమే రద్దు చేయాలని సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, మై రాముడు డిమాండ్ చేశారు. గురువారం పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల దగ్గర ప్రధాన రహదారిలో న్యాయవాదులురిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణయ్య అధ్యక్షత వహించగా ,అనంతరం సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ. ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ అనాలోచిత నిర్ణయం వలన అక్టోబర్ నెల 5 ,వ ,తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఇప్పటికే రూ: 100/- వెల్పేర్ స్టాంప్ ఉందని, అదనంగా మరో రూ:20/- వెల్పేర్ స్టాంపును తీసుకు రావడం చాలా దుర్మార్గం అన్నారు. బార్ కౌన్సిల్ వారి ఈ అనాలోచిత నిర్ణయం వలన పరోక్షంగా భారం కాక్షి దారుల పై పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ: 20/- వెల్పేర్ స్టాంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పై దాడులు జరుగు తున్నాయని న్యాయవాదులు కు రక్షణ చట్టంను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
న్యాయవాదులకు రక్షణ చట్టం లేని కారణంగా దేశవ్యాప్తంగా నిత్యం న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కిడ్నాప్లు చేసి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 35 సంవత్సరాలు దాటిన న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారని, వారికి వెల్ఫేర్ ఫండ్ అవకాశం లేకుండా పోయిందని వారికి కూడా అవకాశం కల్పించాలని కోరారు.
ఈ రిలే నిరాహారదీక్షలు రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.
మొదటి రోజు రిలే దీక్షలో బి. రంగ స్వామి, బి. సురేంద్ర కుమార్, బి. ప్రసాద్ బాబు, యస్. సుధ కృష్ణ, ఎం. నారాయణ స్వామి, కె. దామోదర, డి.బాల బాషా, జి. భాస్కర్, బి. టి. నాగ లక్ష్మయ్య, పి. వాసు దేవా నాయుడు, రాజ శేఖర్ నాయుడు, నరస రావు, జె. రవి కుమార్, లక్ష్మణ స్వామి నాయుడు, నంది వీరేశ్, చంద్ర శేఖర్, కబీర్ దాస్, నెట్టేకల్లు, లక్ష్మన్న, రాజా వర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.