ఐదవ రోజు కొనసాగుతున్న మహిళ ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్

ఐదవ రోజు కొనసాగుతున్న మహిళా ఎస్సై అభ్యర్ధుల ఈ వెంట్స్
(యువతరం ఆగస్టు 30) కర్నూలు ప్రతినిధి:
పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన మహిళ అభ్యర్ధులకు కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో ఐదవ రోజు బుధవారం దేహదారుడ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ , జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ , సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఈ రోజు 700 మంది మహిళ అభ్యర్దులకు గాను 449 మంది అభ్యర్దులు హజరయ్యారు.
వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, బరువు వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు.
అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు జరుగుతున్నాయి.