ANDHRA PRADESHPOLITICS
ఆలపాటి గెలుపుకు దేశం తమ్ముళ్లు ప్రచారం

ఆలపాటి గెలుపుకు దేశం తమ్ముళ్లు ప్రచారం
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 24 యువతరం న్యూస్:
మంగళగిరి 28వ వార్డులో ఈనెల 27వ తేదీన జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం అవార్డు టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు వార్డులోని పట్టభద్రులను కలసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు తోట కరుణ కుమార్, కోలా శ్రీనివాసరావు, షేక్ రజియా, బూసి గోవిందరాజు, వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు.