CRIME NEWSSTATE NEWSTELANGANA
సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై మృతి
ములుగు బ్యూరో డిసెంబర్ 02 యువతరం న్యూస్:
సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఓ ఎస్సై ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లా లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రుద్రారపు హరీశ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏటూరు నాగారం మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రడ్జి సమీపంలో ఉన్న ఓ రిసార్ట్ లో హరీశ్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు.
ములుగు జిల్లాలో గత రెండు రోజుల క్రితం జరిగిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం లేపుతుంది, ఉన్నత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.