ANDHRA PRADESHPOLITICSSTATE NEWS

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మైనార్టీల అభివృద్ధి కి వైకాపా ప్రభుత్వం కృషి

వక్ఫ్ బోర్డ్ జిల్లా చైర్మన్ నియాజ్ అహ్మద్

తుగ్గలి యువతరం విలేఖరి;

రాష్ట్రంలోనే మైనార్టీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వక్ బోర్డ్ జిల్లా చైర్మన్ నియాజ్ అహ్మద్, డైరెక్టర్ టిఎండి హుసేని లు అన్నారు. బుధవారం రాతన గ్రామంలోనే మసీదును వారు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లింల విన్నపం మేరకు ఈద్గాకు ప్రహరీ గోడ నిర్మించేందుకు రూ 36 లక్షలతో, అలాగే మసీదుకు మరమ్మతుల కోసం రూ 5 లక్షలతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని వారు తెలిపారు. అనంతరం ముస్లింలు అభివృద్ధి కోసం వైకాపా ప్రభుత్వం చేస్తున్న వివిధ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వారు వివరించారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైయస్సార్ కె దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ఆర్ వి .మోహన్ రెడ్డి, సర్పంచ్ రాచప్ప, మండల కో ఆప్షన్ సభ్యులు చాంద్ బాషా, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ రహిమాన్, స్థానిక మైనార్టీ నాయకుడు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!