7వ రోజు కొనసాగుతున్న మహిళా ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్

7 వ రోజు కొనసాగుతున్న మహిళా ఎస్సై అభ్యర్ధుల ఈ వెంట్స్
(యువతరం సెప్టెంబర్ 1) కర్నూలు ప్రతినిధి:
పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన మహిళ అభ్యర్ధులకు కర్నూలు ఏపీఎస్పీ 2 వ బెటాలియన్ లో 7 వ రోజు దేహదారుడ్య పరీక్షలు శుక్రవారం జరిగాయి.
ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ , సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ పర్యవేక్షించారు.
శుక్రవారం 697 మంది మహిళ అభ్యర్దులకు గాను 486 మంది అభ్యర్దులు హజరయ్యారు.
వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, బరువు వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు.అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు.
1600 మీటర్ల పరుగు పరీక్షలో 463 మంది మహిళ అభ్యర్థులు పాల్గొన్నారు.
359 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.100 మీటర్ల పరుగు పరీక్షలో 359 మంది మహిళ అభ్యర్థులు పాల్గొన్నారు.80 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
లాంగ్ జంప్ లో 359 మంది మహిళ అభ్యర్థులు పాల్గొన్నారు.249 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.