DEVOTIONALTELANGANA
అంగరంగ వైభవంగా కొనసాగిన జగన్నాథ రథయాత్ర మహోత్సవం

అంగరంగ వైభవంగా కొనసాగిన జగన్నాథ రథ యాత్ర మహోత్సవం
కామారెడ్డి యువతరం ప్రతినిధి;
ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహిచిన శ్రీ జగన్నాథ రథ యాత్ర మహోత్సవం 2023 అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమం పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుండి పట్టణ పుర వీధుల గుండా శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం వరకు కొనసాగింది. పాత సాయి బాబా మందిరం , జీవదాన్ స్కూల్ , నైజాం సాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, రైల్వే కమాన్, సిరిసిల్ల రోడ్, తిలక్ రోడ్, సుభాష్ రోడ్, జే పీ యన్ రోడ్, కన్యకా పరమేశ్వరీ ఫంక్షన్ హాల్ వరకు చేరుకుంది.ఈ రథయాత్ర ను బీజేపీ కామారెడ్డి ఆసెంబ్లి ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించడం జరిగింది.