ANDHRA PRADESHPOLITICS

సిద్దేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం కోసం రాయలసీమ ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుపై వత్తిడి పెంచండి

సిద్దేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం కోసం రాయలసీమ ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుపై వత్తిడి పెంచండి

మహా సముద్రం లాంటి తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలకు మీ స్థాయేంటో తెలిసికోండి

టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలకు తప్పకుండా పదవులు వస్తాయి.

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

కొత్తపల్లి జూన్ 16 యువతరం న్యూస్:

రాయలసీమ రైతులకు మేలుజరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని, నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై తీగల వంతెన (ఐ కానిక్ బ్రిడ్జి ) బదులు బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం కోసం రాయలసీమ మంత్రులు, ఎంపి లు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వత్తిడి పెంచి రాయలసీమ శాశ్వత కరువు, వలసల నిర్ములనకు కృషి చేయాలని, ఇప్పటికే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, తాను పలు మార్లు సిద్దేశ్వరం వద్ద బ్రిడ్జి కంబ్యారేజ్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళామని,మహా సముద్రం లాంటి తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేయాలనుకునే వారి స్థాయేంటో ముందు తెలుసుకోవాలని నంద్యాల జిల్లా లోని కొందరు టీడీపీ నేతలకు చురకలు అంటిస్తూ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రసంగించారు.ఆదివారం నంద్యాల టెక్కె మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ లిమిటెడ్ నూతన చైర్మన్ గా వై. నాగేశ్వరావు పదవి ప్రమాణ స్వీకార సభలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రులు బిసి జనార్ధన్ రెడ్డి, ఎన్ ఎండి ఫరూక్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో బైరెడ్డి మాట్లాడుతూ ఒట్టి మాటలు కట్టిపెట్టి, గట్టిమేలు తలపెట్టయ్ అంటూ మహాకవి గురజాడ అప్పారావు కవితను ఉటంకిస్తూ ప్రజా ప్రతినిధులు ఒట్టి మాటలు కాకుండా రాయలసీమ రైతులకు గట్టిమేలు తలపెట్టేందుకు కృషి చేయాలని కోరారు.
రెండు సార్లు ఎమ్మెల్యే గా, ఉమ్మడి కర్నూలు జిల్లాకు రెండు పర్యాయాలు టీడీపీ జిల్లా అధ్యక్షులుగా తాను బాధ్యతగా పనిచేసి ప్రజా సేవలో కొనసాగుతున్నానని, ప్రస్తుతం నంద్యాల ఎంపీగా తన కూతురు డాక్టర్ బైరెడ్డి శబరి కూడా ప్రజా సేవచేస్తున్నారని అది తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైనందని బైరెడ్డి రాజశేఖరరెడ్డి గుర్తు చేశారు. నంద్యాల జిల్లాలో కొందరు టీడీపీలో భాద్యతాయుత పదవుల్లో ఉంటూ గ్రూప్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, మహా సముద్రం లాంటి తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయం చేయాలనే వారి స్థాయేంటో ముందు తెలుసుకోవాలని టీడీపీలో గ్రూప్ కట్టేవారికి బైరెడ్డి చురకలు అంటించారు.టీడీపీని నమ్ముకొని ఉన్న వారికీ పదవులు వస్తాయి అన్నవాటికి ఎన్ ఎం డి ఫరూక్ నిదర్శనమని, ఎన్ టీ ఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి నేటి వరకు ఫరూక్ నిజమైన టీడీపీ కార్యకర్తగా ఉండడం వల్లే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వీకర్ గా, డిప్యూటీ స్వీకర్ గా, పలు మార్లు రాష్ట్ర మంత్రి గా, ప్రస్తుత రాష్ట్ర మంత్రి గా ఫరూక్ ప్రజా సేవ చేయడం జరుగుతుందని బైరెడ్డి వివరించారు. తాను ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు గా ఉన్న సమయంలో వై. నాగేశ్వరయాదవ్ చురుకైన టీడీపీ కార్యకర్త అని పార్టీని నమ్ముకున్నందుకు సీఎం చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ లిమిటెడ్ కు అధ్యక్షులుగా నాగేశ్వరయాదవ్ కు అవకాశం ఇచ్చారని, ఈ పదవి రైతుల మేలుకోసం ఉపయోగించాలని బైరెడ్డి నాగేశ్వరయాదవ్ కు సలహా ఇచ్చారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!