బాల్య వివాహాలను అరికట్టాలి: వైద్య సిబ్బంది
సర్వేలు సకాలంలో పూర్తి చేయండి: ఎంపీడీవో

సర్వేలు సకాలంలో పూర్తి చేయండి: ఎంపీడీవో
బాల్య వివాహాలను అరికట్టాలి: వైద్య సిబ్బంది
వెల్దుర్తి ఫిబ్రవరి 20 యువతరం న్యూస్:
ప్రభుత్వం తలపెట్టిన సర్వేలు సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో సుహాసినమ్మ పేర్కొన్నారు. బుధవారం తాత్కాలిక ఎంపీపీ రంగయ్య ఆధ్వర్యంలో ఎంపీడీవో సుహాసినమ్మ అధ్యక్షతన మండల సర్వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ప్రసంగించారు. ఈ సందర్భంగా గోవర్ధనగిరి వైద్య సిబ్బంది మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని గోవర్ధనగిరి, శ్రీ రంగాపురం గ్రామాలలో బాల్య వివాహాలు అధికంగా ఉన్నాయన్నారు. బాల్య వివాహాల వల్ల అమ్మాయిలు టీనేజీలోనే గర్భం దాల్చడం జరుగుతుందన్నారు. దీంతో తల్లి బిడ్డలకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోగ్య సిబ్బంది పేర్కొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ గురుస్వామి రెడ్డి, జడ్పిటిసి సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.