ANDHRA PRADESHOFFICIALWORLD

మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు

మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు

పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల కలెక్టరేట్ మార్చి 08 యువతరం న్యూస్:

మహిళల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పునరుద్ఘాటించారు. శనివారం నంద్యాల పట్టణంలోని కేఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, అన్ని సంఘాల మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మహిళలు అభ్యున్నతి చెందాలని, స్వయం శక్తితో ఎదగాలని, సాధికారత దిశగా అడుగులు వేయాలని, సమాజాన్ని ముందుండి నడిపించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. 20వ శతాబ్ద ప్రధమార్ధంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. మహిళలు సాధించిన విజయాలపై ఉత్సవాలు చేసుకోవడమే కాకుండ ప్రతి ఆడబిడ్డకి మంచి చదువు, గౌరవము, సమ అవకాశం, భద్రత, గౌరవప్రదమైన జీవితం ఐదు అంశాలపై చర్చించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడాలన్నారు. మహిళ అంటే ఓర్పు, సహనం, శక్తి, నిబద్ధత, సామర్థ్యం, అంకితభావం, ఆత్మాభిమానం, ప్రేమ, బాధ్యత ఇవన్నీ కలగలిపిన అందమైన వ్యక్తిత్వం గల మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్ ఉత్తేజ పరిచారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు పట్టంకడు తోందన్నారు. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త వచ్చి దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు లింకేజీ కింద 6880 మహిళా సంఘాల సభ్యులకు 74.93 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ సర్వీస్ ద్వారా 2455 మంది మహిళలు స్వయం ఆధారిత ఉపాధి ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ కింద 37 మంది మహిళలకు గ్రౌండింగ్ యూనిట్లు, పీఎంఎజెఎవై క్రింద 69 మహిళలకు ఉత్పత్తి యూనిట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెప్మా ద్వారా 6100 మహిళలకు బ్యాంక్ లింకేజీ రుణాలు, ట్రయాంగిల్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా 389 మంది మహిళలకు సర్వీసులు, 510 మంది మహిళలకు జీవనోపాధి యూనిట్లు మంజూరు చేశామన్నారు. అలాగే నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీం ద్వారా 2069 మంది మహిళలు లబ్ధి పొందారన్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద 68 మంది మహిళలు, పీఎంఈజిపి పథకం కింద 5 మంది మహిళలకు రుణాలు మంజూరు చేశామన్నారు. మైనారిటీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా 315 కుట్టుమిషన్లను, చదువుకొని ఖాళీగా ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కోసం 929 మందికి ఉపాధి పనులు కల్పించామని కలెక్టర్ వివరించారు.

నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నారు. అలాంటి గొప్ప మానవత్వం ఉన్న స్త్రీ మూర్తిని స్మరించుకుంటూ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్నారు. కుటుంబం కోసం ప్రేమను పంచుతూ కష్టాలను అధిగమిస్తూ కుటుంబంతో పాటు అన్ని రంగాలలో ముందడుగు వేసేది మహిళేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో ఆయా ప్రదేశాలలో దేవతలు ఉంటారన్న విషయాన్ని ఎంపీ వివరించారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన దేశం మన భారతదేశమన్నారు. పురుషులతో సమానంగా ఉండాలని అన్నింటిలో సమానత్వ అవకాశాలు చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించి ఆడపిల్లలను ఆడ పులిగా పెంచాలని ఎంపీ కోరారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!