ఉగాది నుండి రాష్ట్రంలో పి-4 విధానం అమలుకు చర్యలు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్

ఉగాది నుండి రాష్ట్రంలో పి-4 విధానం అమలుకు చర్యలు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్
ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియ పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి ఫిబ్రవరి 06 యువతరం న్యూస్:
రాష్ట్రంలో వచ్చే ఉగాది నుండి పి-4 (పబ్లిక్-ప్రవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్ప్) విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. గురువారం అమరావతి నుండి పి-4 విధానంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి,డిఆర్ఓ రాము నాయక్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పి-4 విధానాన్నిఅమలు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నదే పి-4 విధానం ముఖ్య ఆశయమని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విధి విధానాల రూపకల్పనకు ప్రజల నుండి సూచనలు,సలహాలు స్వీకరించండంతో పాటు దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ను కూడా రూపొం దిస్తున్నట్లు చెప్పారు. ఇందుకుగాను ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడలు అధికారిగా నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు(CBP) ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ సున్నా పేదరికం- పి4 విధానం, నియోజకవర్గ అభివృద్ధి విజన్ ప్రణాళికల తయారీ కోసం నోడల్ అధికారులను నియమించాలని సిపిఓ ను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియ అధిక స్థాయిలో పెండింగ్ ఉందని మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు సర్వేని వేగవంతం చేయాలన్నారు. ప్రగతి కనపరచని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంఎస్ఎంఈకి సంబంధించి 650 మంది ఇంకా లాగిన్ కాలేదని సంబంధిత సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులను జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంప్లాయిస్ హౌస్ హోల్డ్ డేటా పూర్తి చేయడంలో వెనుకబడిన సిబ్బందిని వెంటనే నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ (సిబిజి) ప్లాంట్ల ఏర్పాటు కోసం భూములను గుర్తించాలని ఆర్డీఓలను సూచించారు. ఈ సమావేశంలో సిపిఓ వేణుగోపాల్, డీఈవో జనార్దన్ రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఎల్డిఓ శివారెడ్డి, డిపిఓ జమీవుల్లా తదితరులు పాల్గొన్నారు. ఉగాది నుండి రాష్ట్రంలో