ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS
ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు పై మంత్రి క్లారిటీ

ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై మంత్రి క్లారిటీ
అమరావతి ప్రతినిధి జనవరి 25 యువతరం న్యూస్:
ఏపీలో అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే దివ్యాంగులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు.
వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రతినెలా దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచంలో ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందజేస్తోన్న విషయం తెలిసిందే.