ANDHRA PRADESHDEVOTIONALWORLD
తిరువూరు రెవెన్యూ డివిజనల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

తిరువూరు రెవిన్యూ డివిజనల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ డివిజన్ అధికారి కె.మాధురి
తిరువూరు ప్రతినిధి డిసెంబర్ 25 యువతరం న్యూస్:
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రెస్తవులందరికీ ఆర్డిఓ కె. మాధురి శుభాకాంక్షలు తెలిపారు.
కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు.
తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని చెప్పారు.
దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారని తెలిపారు.