ANDHRA PRADESHPROBLEMSSTATE NEWS

మడుగు కాదు రహదారి

చినుకు పడితే చిత్తడే

మడుగు కాదు రహదారి

కొత్తపల్లి యువతరం విలేఖరి;

మండలంలోని ముసలిమడుగు గ్రామంలో గల రహదారులు చినుకు పడితే చిత్తడి, చిత్తడి గా మారి అడుగు బయట పెట్టాలంటే బురదలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సచివాలయ అధికారులు సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారి ఈ విధంగా ఉన్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వేమరపాటుగా వెళ్లడం శోచనీయమన్నారు స్థానికులు. వర్షపు నీరు బయటికి వెళ్లడానికి దారి లేక ఇళ్ల మధ్యనే మురుగు కుంటలుగా మారి బురదమయంగా రహదారులు కనిపిస్తున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఈ దారి వెంట వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు వెళ్లే దారి లేక బురదలోనే ప్రజలు వెళ్ళవలసి వస్తోంది. గ్రామం లో ఇలా ఉంటే అంటు రోగాలు రావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను రూపొందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!