POLITICS
వంకాయల మాలల అలంకరణలో శ్రీ దుర్గా భవాని అమ్మవారు

వంకాయల మాలల అలంకరణలో శ్రీదుర్గాభవానీ అమ్మవారు
కరీంనగర్ యువతరం ప్రతినిధి;
కరీంనగర్ మండలం నగునూర్లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యలో జరుగుతున్న ఆషాడమాసం శాఖాంబరీ ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీదుర్గాభవానీ అమ్మవారు వంకాయల మాలలతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష హారతులిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతోపాటు భక్తులు పాల్గోన్నారు.