డిసెంబరు 17న 4వ జోన్ లో బహిరంగ వేలం నిర్వహణ

డిసెంబరు 17న 4వ జోన్ లో బహిరంగ వేలం నిర్వహణ
4వ జోనల్ కమిషనర్
ఎమ్ .మల్లయ్య నాయుడు
ఉత్తరాంధ్ర ప్రతినిధి డిసెంబరు 11
యువతరం న్యూస్:
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్ లో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, ఒక కళ్యాణ మండపం, ఒక మార్కెట్, జీవీఎంసీ మెయిన్ ఆఫీస్ కాంటీన్ నకు లీజు గజిటు నోటిఫికేషన్ నెంబర్ 07/2024 నందలి నిబంధనలు ప్రకారం అత్యవసర షార్ట్ నోటీసు 07.03.2025 ద్వారా ఇచ్చిన షరతులకు లోబడి అప్పగించిన తేదీ నుండి మూడు సంవత్సరాల పరిమితికి గుత్తకిచ్చుటకుగాను డిసెంబరు 17న తేది ఉ.గం.11.00 లకు జోన్-4 సూర్య బాగ్ కార్యాలయం నందు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగునని 4వ జోన్ జోనల్ కమిషనర్ ఎమ్.మల్లయ్య నాయుడు గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
అలాగే జివిఎంసి 4వ జోన్ (సూర్యబాగ్) పరిధిలో గల డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము(గ్రౌండ్ ఫ్లోర్) , షాప్ లు 8,9,10,11(ఎస్ సి), 12, 13(పి హెచ్) & 15(ఎస్ సి), (వార్డు నెం.35, నియర్ స్పింగ్ రోడ్), డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము (మొదటి అంతస్తు) షాప్ లు 2(ఎస్ సి), 3,4,5,6,7,8,9,10,11(ఎస్ సి), 12,13(పి హెచ్),14(ఎస్ టి),15(ఎస్ సి) (వార్డు నెం.35, నియర్ స్పింగ్ రోడ్), జగదాంబ వాణిజ్య సముదాయము షాప్ లు 3,5(పి హెచ్),11,12,14&13(ఎస్ టి) (వార్డు నెం.31), పాత బస్ స్టాండ్ ఫేస్-II దుకాణాములు 1,2,3(పి హెచ్),4,5,6, 7(ఎస్ సి), 8, 9(ఎస్ టి), 10,11, 12(ఎస్ సి),13,14 (వార్డు నెం.35), పాత బస్ స్టాండ్ ఫేస్-I దుకాణాము 5(ఎస్ సి) (వార్డు నెం.35), పద్మనగర్ వాణిజ్య సముదాయము 3, 4(ఎస్ సి), 6,7,11,12(ఎస్ సి) & 8(ఎస్ సి) (వార్డు నెం.39, లక్ష్మిటాకీస్ దగ్గర), సూర్యబాగ్ వాణిజ్య సముదాయము 8(ఎస్ సి) (గ్రౌండ్ ఫ్లోర్), 9(ఫస్ట్ ఫ్లోర్) (వార్డు నెం.31, నియర్ జివిఎంసి జోనల్-4 ఆఫీసు), టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వాణిజ్య సముదాయము 18,21,33,37,39(ఎస్ టి),46(ఎస్ సి),51(ఎస్ టి) (వార్డు నెం.31), అంగడిదిబ్బ వాణిజ్య సముదాయము 2(యస్ సి) (వార్డు నెం.29), జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని కాంటీన్ (వార్డు నెం.28), రెల్లివీధి రోడ్ సైడ్ ఫిష్ మార్కెట్లును 3 సంవత్సరముల కాల పరిమితికి గుత్తకు ఇచ్చేందుకు తేదీ 17-12- 2025 ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించబడునని జోనల్ కమిషనర్ తెలిపారు.
సదరు వేలంపాటలో పాల్గొనదలచిన వారు దరావత్తు సొమ్ము తదితర పూర్తి వివరాలకు 4వ జోనల్ కార్యాలయం పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలిపారు.



