ANDHRA PRADESHSPORTS NEWSWORLD

ఏసీఏ తరఫున టీమ్ ఇండియాకు ఘన స్వాగతం 

రోహిత్, కోహ్లీ, గంభీర్‌కు జ్ఞాపికల బహూకరణ

ఏసీఏ తరఫున టీమ్ ఇండియాకు ఘన స్వాగతం 

రోహిత్, కోహ్లీ, గంభీర్‌కు జ్ఞాపికల బహూకరణ

ఉత్తరాంధ్ర ప్రతినిధి డిసెంబర్ 6 యువతరం న్యూస్

ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మూడో వన్డే సాగనున్న నేపథ్యంలో, టీమ్ ఇండియా విశాఖపట్నానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు భారత జట్టుకు ప్రత్యేక స్వాగతం పలికారు.

తరువాత ఏసీఏ తరఫున సీనియర్ క్రికెటర్లైన ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, జట్టు కోచ్ గౌతమ్ గంభీర్లకు జ్ఞాపికలను బహుకరించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సి వి ఓ గిరీష్ డోంగ్రీ, ఎసిఏ స్టేడియం చైర్మన్ ప్రశాంత్, వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావు, కోశాధికారి దండమూడి శ్రీనివాసరావు, ఏసీఏ కౌన్సిలర్ విష్ణు దంతు, బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్‌లో భారత క్రికెటర్ల సంఘం (ఐ సి ఏ) ప్రతినిధి చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!