ANDHRA PRADESHDEVOTIONALWORLD

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన యాడికి పెద్దమ్మ తల్లి

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన యాడికి పెద్దమ్మ తల్లి

ప్రజలు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు

యాడికి సెప్టెంబర్ 23 యువతరం న్యూస్:

యాడికి లో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లికి ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యమి సోమవారం నవరాత్రులలో మొదటి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉదయం సుప్రభాత సేవ మొదలు గంగా స్నానము పట్టు వస్త్రాల సమర్పణ పంచామృతాభిషేకం హోమాది కార్యక్రమాలు నైవేద్య సమర్పణ మహా మంగళహారతి శాస్త్రవేత్తంగా పేద పండితుల సమక్షంలో పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ మరియు ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 600 మంది పైగా భక్తులు రావడం తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగిందని జై పెద్దమ్మ తల్లి అనే నినాదాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మ్రోగిందని సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన మణిద్వీప వర్జన భక్తి పాటలతో భజన కార్యక్రమం పంచ హారతులు మొదలై తీర్థ ప్రసాదాల కార్యక్రమాలు ఉంటాయని పెద్దమ్మతల్లి ఆలయ అభివృద్ధి కమిటీ తెలియజేయడం జరిగింది నవరాత్రుల్లో మొదటి రోజున పెద్దమ్మ తల్లికి 21 కేజీల కంచుగంట తయారు చేయించడం జరిగిందని ఆలయ కమిటీ వారు తెలియజేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!