ANDHRA PRADESHPROBLEMS
ఎవ్వరు పట్టించుకోరు…. వీధి దీపాలు వెలుగవు

ఎవ్వరు పట్టించుకోరు…. వీధి దీపాలు వెలుగవు
కొత్తపల్లి ఆగస్టు 8 యువతరం న్యూస్:
కొత్తపల్లి మండలంలోని ముసలిమడుగు గ్రామంలోని బీసీకాలనీలో వీధి దీపాలు వెలుగక అంధకారంతో ఇబ్బందులు పడుతున్నారు సుమారు రెండు నెలల నుంచి వీధి దీపాలు వెలగడం లేదని, రాత్రి వేలల్లో రాకపోకలకు ఇబ్బందుపడుతున్నామన్నారు. సీసీ రహదారులు లేక వర్షం పడితే రహదారులు బురదమయంగా మారుతున్నాయని,చీ కట్లో జారీ పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వీధీ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.



