శ్రీశైల మహా క్షేత్రం నందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు

శ్రీశైల మహా క్షేత్రం నందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు
శ్రీశైలం ప్రతినిధి జూలై 25 యువతరం న్యూస్:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రం నందు లోక కళ్యాణం కోసం దేవస్థానం గురువారం రోజు ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలను నిర్వహించింది.
ప్రతి గురువారం దేవస్థానం సేవగా సర్కారీ సేవగా ఈ కైంకర్యం జరిపించబడుతుంది.
ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా శ్రీ మహాగణపతి పూజ జరిపించబడింది. తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాభిషేకం విశేష పూజలు నిర్వహించబడ్డాయి.
లోకద్ధరణ కోసమై బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకే స్వరూపంలో దత్తాత్రేయునిగా అవతరించారు అందుకే త్రిమూర్తి స్వరూపిణిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధిడు.
ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద శ్రీ దత్తాత్రేయుల వారు తపస్సు చేశారని ప్రతిదీ అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షం అని పేరు.
కాగా దత్తాత్రేయ స్వామి వారు కలియుగంలో గోదావరి తీరాన పిఠాపురంలోని శ్రీపాద వల్లభునిగా జన్మించారు వీరు ఒకసారి శ్రీశైలం క్షేత్రంలోని చత్రు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురు చరిత్రలో చెప్పబడింది.
కాగా శ్రీపాద వల్లభుడు తమ శిష్యులను తీర్థ క్షేత్రాల మహిమ విశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు.
శ్రీపాద వల్లభుల జన్మ తర్వాత మహారాష్ట్రలోని కరంజీ నగరంలో నరసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయ స్వామి వారి జన్మించారు వీరు ఒకసారి శివరాత్రి రోజున శ్రీశైల మల్లికార్జున సేవించినట్లుగా కూడా గురు చరిత్ర చెప్పబడుతుంది. నృసింహ సరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళ గంగలోనే చేశారు.
కలియుగ ప్రభావం రోజురోజుకు ఎక్కువ కావడంతో నృసింహ సరస్వతి స్వామి వారు అదృశ్య రూపంలో ఉండి తన భక్తులను రక్షించాలని నిర్ణయించారు దాంతో భౌతిక దేహాన్ని సృజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చారు.
శ్రీశైలంలోని కదలి వనం దగ్గర తమ శిష్యులు చూస్తూ ఉండగానే నరసింహ సరస్వతి స్వామి వారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చుని కృష్ణా నదిలోకి ప్రవేశించి కొంత దూరం ఆ అరిటాకులపైని పయనిస్తూ అదృశ్యమైనట్లు కురిచే చరిత్ర చెప్పబడుతుంది.