ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL

డ్రగ్స్ కు బానిస కావొద్దు….. జీవితం నాశనం చేసుకోవద్దు

డ్రగ్స్ కు బానిస కావొద్దు….. జీవితం నాశనం చేసుకోవద్దు

కోడుమూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సిఐ మంజుల

వెల్దుర్తి జూన్ 26 యువతరం న్యూస్:

మండల కేంద్రమైన వెల్దుర్తి లోని జూనియర్ కాలేజీలో బుధవారం కోడుమూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సిఐ మంజుల ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల రగడగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిఐ మంజుల మాట్లాడుతూ డ్రగ్స్ కు బానిస కావద్దు.. జీవితం నాశనం చేసుకోవద్దు అని సూచించారు. ముఖ్యంగా తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ మహమ్మారిన పడి జీవితం కొందరు నాశనం చేసుకోవడం చూడడం జరుగుతుందన్నారు. డ్రగ్సు తీసుకోవడం వల్ల సమాజంలో విలువలు కోల్పోవడంతో పాటు, సామాజిక స్పృహ కోల్పోయి, తల్లిదండ్రులను సమాజంలో తల ఎత్తుకో లేనంత ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కాబట్టి ఇటువంటి సమాచారం ఏదైనా ఉన్నా సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డ్రగ్స్ అలవాటుగా అయి వ్యసనంగా మారుతుందన్నారు. మీరు ఎవరికోసమైనా మద్యం సీసాలు తీసుకొని రావడం జరిగితే ఆ సమయంలో తనిఖీలలో మీరు దొరికితే తప్పకుండా కేసు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ నాగభూషణ్ రెడ్డి, ఎస్ఐ శివరామిరెడ్డి, కాలేజీ లెక్చరర్లు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!