రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ప్రగడ రాజశేఖర్

రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ప్రగడ రాజశేఖర్
మంగళగిరి ప్రతినిధి జూన్ 23 యువతరం న్యూస్:
మంగళగిరి రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులుగా ప్రగడ రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సమావేశం చిన కాకాని లోని లిటిల్ విలేజ్ హోటల్ ఆవరణలో గాజుల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిధిగా 3125 మాజీ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మంగళగిరి రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలతో ముందంజలో నిలవడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 2025-26 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నూతన అధ్యక్షులుగా ప్రగడ రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా అందే మురళి, కార్యదర్శిగా పారేపల్లి నిరంజన్ గుప్తా, సహాయ కార్యదర్శులుగా కాపరౌతు సుందరయ్య,జొన్నాదుల భిక్షారావు, కోశాధికారిగా కెవిఎస్ ప్రకాశరావును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ రిలేషన్ రావెల శ్రీనివాసరావు, జీఎస్ నాయక్, గోలి శ్రీకాంత్, చనుమోలు గోపాల్, ఉడతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.