ANDHRA PRADESHOFFICIAL

నకిలీ పట్టాలు తయారు చేస్తే కఠిన చర్యలు

నకిలీ పట్టాలు తయారు చేస్తే
కఠిన చర్యలు

తహసిల్దార్ త్రిబువన్ రెడ్డి

బద్వేలు ప్రతినిధి జూన్ 18 యువతరం న్యూస్:

నకిలీ పట్టాల విషయంలో కఠిన చర్యలు చేపట్టేందుకు అన్ని
ఏర్పాట్లు పూర్తి చేశామని గోపవరం తాసిల్దార్ త్రిబువన్ రెడ్డి అన్నారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏవైనా సమస్యలు విలేకరుల దృష్టికి వస్తే సంబంధిత అధికారుల వివరణతో వార్తలను రాయాలన్నారు. నిరాధారమైన వార్తలను ప్రచురిస్తే చర్యలు చేపడతామన్నారు.ఇప్పటికే కొన్ని విషయాలలో పరువు నష్టానికి సంబంధించిన కేసును నమోదు చేయించడం జరిగిందన్నారు. బద్వేలు మండలం సిద్ధవటం రోడ్ లోని ఓ గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు నిరాధారణ ప్రచురణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.ప్రస్తుతం పిపి కుంట వద్ద నిర్మితమవుతున్న గుడిసెల విషయమై కొంతమంది నిరాధారణ నిందారోపణలను రెవెన్యూ శాఖ మీద రుద్దడం జరిగిందని అది సరైన పద్ధతి కాదన్నారు. కొంతమంది విలేకరులు అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు.అదేవిధంగా వాగులు చెరువు సంబంధించిన భూములు ఆక్రమణకు గురవుతున్న విషయం తెలిసిందే.ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే కఠిన చర్యలను చేపడతామన్నారు. అంతేకాకుండా మేము నిర్వహించే ప్రతి కార్యక్రమం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేస్తున్నామన్నారు. నకిలీ పట్టాలకు సంబంధించిన స్థలాలను ఎవరు కొనుగోలు చేయకూడదన్నారు. అదేవిధంగా తమ కార్యాలయంలో ఎటువంటి ఒరిజినల్ రికార్డులు లేవన్నారు.గతంలో నకిలీ పట్టాల విషయంపై కేసు నమోదైన సమయంలో కొన్ని రికార్డులు ఆర్టీవో కార్యాలయంలో మరికొన్ని రికార్డులు పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాయని తెలిపారు.ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు నాకు లేవన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఎవరి పట్ల తమకు శత్రుత్వం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.మా తల్లి వయసులో ఉన్న మహిళలను ఆప్యాయతగా పలకరించడం తప్పుగా భావించకూడదన్నారు. ప్రజలకు ఏర్పడే సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికే రెవెన్యూ పరంగా ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలను తప్పనిసరిగా అందజేస్తామన్నారు.అయితే గతంలో ప్రభుత్వ స్థలాలలో గృహాల నిర్మించుకొని ఉన్నవారికి ఎటువంటి పరిస్థితుల్లో ఇంటి పట్టాలు ఇవ్వడం కుదరదన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో ఎవరిని తక్కువగా చూడాల్సిన అవసరం తమకు లేదన్నారు.ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తూనే ఉన్నామన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!