ANDHRA PRADESHDEVOTIONALWORLD

జలాధివాసంలోకి సంగమేశ్వరుడు

జలాధివాసంలోకి సంగమేశ్వరుడు

గర్భాలయంలో వేపదారు

శివలింగాన్ని ముంచెత్తిన

కృష్ణాజలాలు

కొత్తపల్లి జూన్ 16 యువతరం న్యూస్:

సంగమేశ్వరుడు ఆదివారం కృష్ణమ్మ ఒడిలో జలాధివాసమయ్యాడు ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తడంతో శ్రీశైల జలాశయ నీటిమట్టం ఆదివారం ఉదయం 839 అడుగులకు చేరడంతో ఆలయ ప్రాంగణంలో కృష్ణజలాలు ప్రవేశించాయి. సంగమేశ్వరునికి ఆలయ పురోహితులు తెలకపల్లిరఘురాము శర్మ జలాధివాస పూజలు,సప్తనది జలాలకు జలహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం సాయంత్రానికి శ్రీశైల జలాశయ నీటిమట్టం 840.40 అడుగులకు చేరుకోవడంతో గర్భాలయంలో నలుగు అడుగుల మేర నీరు చేరాయి. గత ఏడాది వర్షాలు ఎక్కువడంగా కురవడంతో ఆలస్యంగా మార్చి మాసంలో మూడవ వారంలో సంగమేశ్వర ఆలయం బయటపడింది. దాంతో పాటు ముందుగానే నైరుతి రుతుపవనాలు రాక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురవడంతో కృష్ణమ్మ త్వరగా పరుగులు తీసింది. ఈ ఏడాది కేవలం మూడు నెలలు మాత్రమే సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం చుట్టూ నీరు చేరడంతో సంగమేశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు, సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!