అమరావతిలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

అమరావతిలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని ముమ్మిడివరంలోమహిళలు ఆందోళన
అమలాపురం/ ముమ్మిడివరం ప్రతినిధి జూన్ 11 యువతరం న్యూస్:
అమరావతిలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో ఎన్డీఏ పార్టీల మహిళలు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి జగ దీశ్వరి, నగర మహిళా అధ్యక్షురాలు మెండి కమల ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు.
స్థానిక పోలమ్మ చెరువుగట్టు న ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి జనసేన బిజెపి పార్టీల నాయకులు, మహిళలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని సాక్షి పేపర్ ప్రతులను ప్రధాన రహదారిపై దగ్ధం చేశారు..
రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులో ఓ మహిళ ఉన్న మనదేశంలో ఓ మహిళ సారథ్యంలో నడుస్తున్న సాక్షి మీడియా మహిళలు పట్ల అవమానకరంగా వ్యవహరించటపై మహిళలు మండిపడ్డారు..
తక్షణం సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని అవమానకరంగా మాట్లాడిన వారిని ప్రచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ , గొల్ల కోటి దొరబాబు, దొమ్మేటి రమణ కుమార్ , గొల్లపల్లి గోపి, ఏళ్ల ఉదయ్, వి ల్ల వీరస్వామి నాయుడు,,బొక్కా రుక్మిణి, సాక సీతాదేవి, ముత్యాల శ్రీ జయలక్ష్మి, బద్రి రమా,గడ్డి రత్నశ్రీ, రూప, బిజెపి శ్రీ దుర్గ, కుడుపూడి మల్లేశ్వరి, పెదపూడి రుక్మిణి, మాదే యోగేశ్వరి, అత్తిలి లక్ష్మి ప్రసన్న, గాలిమిల్లి గంగాభవాని, రెడ్డి శ్రీను, గోదాసి గణేష్, కొరసాల శివ, కాశి లాజర్, నీతిపూడి వంశీ, మట్టపర్తి సత్యనారాయణ, ఎస్ఎంఎస్ ప్రసాద్, దొంగ గంగాధర్, బొక్క సురేష్, గోరింట శ్రీను రాజు, సరిపెల్ల శ్రీనివాసరాజు, పాయసం చిన్ని, జాగు సత్తిబాబు, చింతపల్లి రాజు, బూరుగు కళ్యాణ్,కొప్పిశెట్టి సెట్ ,శీలం వెంకట రమణ,మొదలగు వారు పాల్గొన్నారు.