కాజలో ఘనంగా ఏరువాక ఉత్సవం

కాజలో ఘనంగా ఏరువాక ఉత్సవం
రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది
కాజా గ్రామంలో ఏరువాక ఉత్సవంలో పాల్గొని వ్యవసాయ పనులను ప్రారంభించిన జవ్వాది
మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్
మంగళగిరి ప్రతినిధి జూన్ 11 యువతరం న్యూస్:
మంగళగిరి మండలం కాజా గ్రామంలో ఏరువాక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామలో గల శ్రీ రత్న గర్భ విగ్నేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఏరువాక పౌర్ణమి పండగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఏరువాక ఉత్సవంలో మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ హాజరయ్యారు. గ్రామంలో ,అరక కట్టి, నాగలితో దుక్కు దున్ని వ్యవసాయ పనులను జవ్వాది కిరణ్ చంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జవ్వాది మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతులకు వారి ఖాతాలలో డబ్బులను జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సీజన్లో రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించడానికి కూడా ప్రభుత్వం అధికారులకు ఆదేశించినట్లుగా ఆయన తెలిపారు.రైతులు తమ వ్యవసాయ పనిముట్లను శోభాయమానంగా అలంకరించుకొని నూతన ఉత్సాహంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజే ఏరువాకా అని జవ్వాది అన్నారు. ఏడాదంతా పంటలు బాగా పండాలని రైతులకు శుభం జరగాలని ఆ భగవంతున్ని పార్థిన్తున్నట్లు జవ్వాది కిరణ్ తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ ఏరువాక ఉత్సవంలో
రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు కళ్ళం రాజశేఖర్ రెడ్డి,ఎర్రగుంట్ల భాగ్య రావు,గ్రామ పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, గాదే పిచ్చిరెడ్డి, దానబోయిన రామరాజు, అప్పికట్ల రత్నం నాయుడు,సింహాద్రి భాస్కర్ రెడ్డి, దొడ్డక గంగరాజు, మాణిక్యాలరావు, గాదే సుధాకర్ రెడ్డి, వల్లూరి శివయ్య, పల్నాటి నాగేశ్వరరావు, నారాయణ, బొక్క సురేష్, నరదాల శివరామయ్య, కుక్కమళ్ళ దానియేలు, తోట సాంబయ్య, ఈపూరి పెద్దబ్బా, మల్లవరపు వెంకట్, కుక్కమళ్ళ విక్రమ్, బింకా కోటేశ్వరరావు, చావలి ఉల్లయ్య, పెదరామిరెడ్డి, ఆర్ల రామారావు, సుబ్బారావు,రమేష్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.