ANDHRA PRADESHBREAKING NEWSPOLITICSWORLD

టిడిపి గొప్ప విజయం

టీడీపీ గొప్ప విజయం

టీడీపీ ద గ్రేట్

కోటి 49 వేల సభ్యత్వంతో రికార్డ్

ప్రపంచంలో ఏ స్థానిక పార్టీకిలేని ఆదరణ

చంద్రబాబు, లోకేష్ లపై నమ్మకానికి ఇది ప్రతీక

ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా

కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్

అమరావతి ప్రతినిధి జనవరి 17 యువతరం న్యూస్:

తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కోటి 49వేల సభ్యత్వంతో గొప్ప విజయం సాధించిందని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ కోటి 49వేల సభ్యత్వంతో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఓ రికార్డ్ సృష్టించిందని ఆయన తెలిపారు. ఈ కోటి 49వేల మంది కార్యకర్తలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాదబీమా పార్టీ కల్పించినట్లు ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తలకు టీడీపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ప్రపంచంలో ఎక్కడా ఒక ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వం లేదన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి, పట్టుదల వల్లే ఇది సాధ్యమైందన్నారు. పార్టీ శాశ్వత సభ్యులుగా 145 మంది లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకోవడంలో మంగళగిరి నియోజకవర్గం చరిత్రలో నిలిచిందని ఆయన తెలిపారు మొదటి స్థానంలో మంగళగిరి నియోజకవర్గం నిలిచిందని, రెండవ స్థానంలో ఆత్మకూరు నియోజవర్గంలో 135 మంది, మూడో స్థానంలో వినుకొండ నియోజవర్గంలో 79 మంది, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో 62 మంది తణుకులో 60 మంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నారని ఆయన తెలిపారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ఓ బ్రాండ్ గా నిలిచి, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, పరిశ్రమల స్థాపన, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, నూతన పారిశ్రామిక ఆవిష్కరణలతో అమరావతిలో దూసుకుపోతున్న ఫలితమే ఇదని అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా యువత చంద్రబాబు నాయుడుపై, కూటమిపై ఎంతో నమ్మకం ఉంచి ఎన్నికల్లో అఖండ విజయం సమకూర్చారని ఆయన చెప్పారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవిరళ కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక అంశాలపై చంద్రబాబు లోకేష్ లు దృష్టి సారించి అనేక లక్ష్యాలను సాధించారన్నారని ఆయన తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ లు ఒకటవ తేదీనే ఇవ్వడమే కాకుండా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని రూ.4వేలకు పెంచినట్లు ఆయన వివరించారు. అలాగే, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్ మెంట్ నుంచి ఆరోగ్యశ్రీ, కాంట్రాక్టర్ల బకాయిల వరకు చెల్లించుకుంటూ వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాలనలో ఈ విజయపరంపరే తెలుగుదేశం పార్టీలో కోటి మంది కార్యకర్తలుగా చేరడానికి కారణమని పాతర్ల రమేష్ తెలిపారు. ఈ విజయోత్సవాన్ని రాష్ట్ర మంతటా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఇదే నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సంపదను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన ఏకైక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రన్న అని ప్రజలందరూ తెలుసుకున్నారని ఆయన తెలిపారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగిన ఏకైక నాయకుడు చంద్రన్న అని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని ఆయన తెలిపారు అందుకే అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని ఆయన తెలిపారు

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!