ANDHRA PRADESHPROBLEMS
కంపు…కంపు..

కంపు…కంపు..
ప్రభుత్వ కార్యాలయాల పక్కనే మురుగు మయం
కొత్తపల్లి ఫిబ్రవరి 22 యువతరం న్యూస్ :
కొత్తపల్లి మండల కేంద్రంలోని పశువైద్యశాలకు వెళ్లే దారిలో మురుగు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతుంది. ఆ కార్యాలయం పక్కనే కేజీబీవీ పాఠశాల, మండల వ్యవసాయ కార్యాలయము, పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి. ఈ కార్యాలయాలకు నిత్యం ఆయా గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ కార్యాలయాల పక్కనే మురుగు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మురుగు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.