జనసేన పవర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ

“జనసేన పవర్ లీగ్” పోస్టర్ ఆవిష్కరణ
(యువతరం ఆగస్టు 19) విశాఖ ప్రతినిధి:
పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి డా. సందీప్ పంచకర్ల ఆదేశాల మేరకు “జనసేన పవర్ లీగ్” ను ఈనెల 26 నుంచి ప్రారంభం కానుందని జనసేన సీనియర్ నాయకులు జగదభి రామ కన్స్ట్రక్షన్ చైర్మన్ నక్క శ్రీధర్ పత్రిక సమావేశంలో వెల్లడించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఎండాడ లో “జనసేన పవర్ లీగ్”పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.అనంతరం సీనియర్ నాయకులు బి.వి కృష్ణయ్య మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకొని ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ తమ సొంత నిధులతో నిర్వహిస్తున్న నక్కా శ్రీధర్ ను ఆయన అభినందించారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని తెలిపారు. ఈ ఎన్ ఎస్ చందర్రావు మాట్లాడుతూ ముందుగా ఉత్తరాంధ్రలో విజయవంతంగా వారాహి యాత్ర ముగిసిందని, ఈ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ టోర్నమెంట్ నిర్వాహకులు నక్క శ్రీధర్ కు అభినందనలు తెలియజేశారు. శాఖరి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉంటున్న ప్రతి జనసైనికున్ని ఒక కుటుంబంలా ఏకం చేయాలన్నదే ఈ టోర్నమెంట్ లక్ష్యమని ఈ టోర్నమెంట్ ఇటువంటి రుసుము లేదని ఇంత ఇలాంటి టోర్నమెంట్ను నిర్వహించనున్న జగదభి రామ కన్స్ట్రక్షన్ చైర్మన్ నక్కా శ్రీధర్ ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బీవీ కృష్ణయ్య, ఈ ఎన్ ఎస్ చందర్రావు, శాఖరి శ్రీనివాస్, నక్క శ్రీధర్, సంతోష్ నాయుడు, బాలు, శ్రీకాంత్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.