
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా బిఆర్ఎస్ పార్టీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతరం ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నందు ప్రాంగణం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు . బుధవారం నాడు మండలానికి చెందిన సున్నం నాగేశ్వరరావు, బర్ల వీరయ్య లు బిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి ఆయన వారు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు చొప్పున రెండు కుటుంబాలకు కలిపి 4 లక్షల రూపాయల విలువగల చెక్కులు వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది, సీఎం కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చెక్కు మంజూరు చేసినందుకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు