


పోలెండ్ అమ్మాయి రేపల్లె అబ్బాయి
మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు
రేపల్లె ఫిబ్రవరి 25 యువతరం న్యూస్:
రేపల్లె యువకుడు జగదీష్ సాన్నిహిత్యంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, మన వివాహ వ్యవస్థకు ఆకర్షితురాలై పోలెండ్ కు చెందిన లినా రేపల్లె పట్టణం ఇసుకపల్లి 18 వ వార్డుకు చెందిన కాట్రగడ్డ శ్రీపతి – పద్మజ దంపతుల కుమారుడు జగదీష్ ను వివాహమాడింది. స్థానిక వీరవల్లి కోటయ్య కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం మూడు ముళ్ళు, ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు. వధువు లినా తల్లిదండ్రులు ఆర్ మారక్- దొరోటా కారణాంతరాల వల్ల రాలేకపోవటంతో రావెళ్ల సురేష్ బాబు-స్వప్న దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. వివాహ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్, సిటీ కేబుల్ అధినేత మాగంటి సాంబశివరావు, స్థానిక నేతలు కె అగస్త్య, ధర్మ తేజ తదితరులు పాల్గొని ఆశీర్వదించారు.



