ఈనెల 18 నుండి 23 వరకు వైభవంగా ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈనెల 18 నుండి 23 వరకు వైభవంగా ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బద్వేలు ప్రతినిధి జూన్ 18 యువతరం న్యూస్:
బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డు ఫైర్ ఆఫీస్ వెనుక వెలసిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ ఆంజనేయస్వామి దేవాలయం దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 18,వ తారీకు బుధవారం నుండి 23,వ తారీకు సోమవారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు వల్లo కొండు వెంకటరమణ, అధ్యక్షులు నిమ్మకాయల గురివిరెడ్డి, గౌరవ సలహాదారులు సీనియర్ అడ్వకేట్ జి, త్రివిక్రమ్ సింగ్, సెక్రటరీ గొడిశిపాటి అంకయ్య, వల్లంకొండు శివకుమార్, మెంటా వెంకట నాగేంద్ర, సల్ల గొలుసుల శ్రీనివాసులు, ఆలయ అర్చకులు నడిగట్ల వీరేశాచార్యులు తోపాటు పలువురు కమిటీ సభ్యులు తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 18,వ తారీఖు బుధవారం సాయంత్రం విశ్వకేశాన ఆరాధన పుణ్యాహ వచనం రక్షాబంధనం మృత్సం గ్రహణం యాగశాల ప్రవేశం అంకురార్పణ గరుడ పట ఆదివాసము తీర్థప్రసాద వినియోగం అలాగే గురువారం ద్వజారోహణం దేవతాహ్వానము మహా కుంభ ఆరాధన చతుస్థానార్చన తీర్థప్రసాద వినియోగమని సంతాన ప్రాప్తి కొరకు గరుడ ప్రసాదం అనంతరం సాయంత్రం శేష వాహన లో స్వామివారు భక్తులకు దర్శనం కలదు, అలాగే శుక్రవారం ఉదయం చతుర్థానర్చన లక్ష్మీనారాయణ హోమం వేద స్వస్తి సాయంత్రం హనుమాన్ వాహనం పైన భక్తులకు దర్శనం, అలాగే 21వ తారీకు శనివారం ఉదయం 9 గంటల నుండి అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణ మహోత్సవం కార్యక్రమం కలదు, అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం తదుపరి సాయంత్రం గరుడవాహన సేవలో పురవీధులలో భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వనన్నారు, స్వామివారి గ్రామోత్సవం వెంబడి వల్లేరవారి పల్లెకు చెందిన శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకీ వారి బృందంకి కోలాటం కలదు, ఆదివారం ఉదయం చతుర్థానర్చన లక్ష్మీ హయగ్రీవ హోమము వేద స్వస్తి సాయంత్రం తిరుచ్చి వాహన సేవలు భక్తులకు స్వామివారి దర్శనం 23 సోమవారం ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారోహణం, మహా పూర్ణాహుతి, కుంభ సంప్రోక్షణ మరియు వైభవంగా స్వామి వారికి పుష్పయాగం మహాదాశీర్వచనం కలదు, కావున స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని స్వామి వారి కార్యక్రమాలు తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు తెలియజేయడమైనది.