ANDHRA PRADESHPOLITICS

నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం

నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది

సంక్రాంతి తరువాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము

గౌరు చరితమ్ పాణ్యం ఎంఎల్ ఏ

నిరుద్యోగుల జీవితాలతో జగన్ మోహన్ రెడ్డి ఆటలు ఆడారు

కర్నూలు ప్రతినిధి జనవరి 9 యువతరం న్యూస్:

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిశ్రమలు స్థాపించి స్థానిక యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. జయసూర్య
నందికొట్కూరు ఎం ఎల్ ఏ
కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే లు అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఇంటివద్ద ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం ( ఏపీ ఎన్ ఎఫ్ )నూతన సంవత్సర క్యాలెండర్ ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, నందికొట్కూరు తెదేపా ఇంచార్జ్ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామి మేరకు మెగా డిఎస్సీ పై తొలి సంతకం చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించి నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పిస్తారన్నారు.అందులోభాగంగానే డ్రోన్ హాబ్, సెమి కండక్టర్ పరిశ్రమలు స్థాపిస్తున్నారని చరితమ్మ అన్నారు. ఇంటర్ విద్యార్థులకు గతంలో తెలుగు దేశం పార్టీ మద్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తే గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని రాష్ట్రంలో తిరిగి కూటమి ప్రభుత్వం రావడంతో డొక్కా సీతమ్మ మద్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసి విద్యార్థుల ఆకలి తీర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు దక్కుతుందన్నారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం భర్తీ చెయ్యక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాలను భరీ చేస్తూ యువతకు భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 6500 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది అని అదేవిధంగా సంక్రాంతి తరువాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువనేత బి.శ్రీరాములు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం యువతను విస్మరించడంతో ఉద్యోగాల కోసం యువత వలసలు వెళ్లి ఉద్యోగాలు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో యువతకు భరోసా వచ్చిందన్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్ కి శ్రీరాములు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలకొలను సుధాకర్ రెడ్డి, పూసులూరు ప్రభాకర్ రెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, నవ్యంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు అయ్యాస్వామి, నరసింహ రాజు, రాజన్న, రాజు, నాగరాజు, సూర్యప్రకాష్, రాముడు ,వెంకటేష్ ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!