ANDHRA PRADESHOFFICIAL

ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం

ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం

వెల్దుర్తి జనవరి 8 యువతరం న్యూస్:

మండల కేంద్రమైన వెల్దుర్తి లోని ఎంపీడీవో కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి వేతనదారునికి జాబ్ కార్డ్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాబ్ కార్డులో సభ్యత్వం కలిగిన ప్రతి వేతన దారులతో శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా సమావేశాలు పని కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబం లేదా వేతన దారుని నుంచి డిమాండ్ తీసుకుని తేదీతో కూడిన రసీదును తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబం లేదా వేతన దారుని డిమాండ్ మేరకు పని కల్పించాలి అన్నారు. ఎం సి సి నుండి మస్టర్లను తీసుకుని మేట్లకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుహాసినమ్మ, ఏపీఓ లక్ష్మన్న, ఈసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!