ANDHRA PRADESHDEVOTIONALOFFICIALWORLD
గణేష్ మండపాల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వెబ్ సైట్

గణేష్ మండపాల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వెబ్ సైట్
అమరావతి యువతరం డెస్క్:
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించాము అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ganeshutsav.net ద్వారా వినాయక మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఈ వెబ్ సైట్ ను ఉపయోగించు కోవాల్సిందిగా కోరుతున్నామన్నారు.