ANDHRA PRADESHDEVELOPOFFICIAL

రూ.5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్ ప్రారంభం

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

రూ.5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్ ప్రారంభం

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

పాములపాడు అక్టోబర్ 25 యువతరం న్యూస్:

మండల కేంద్రమైన పాములపాడు లోని ఎస్సీ కాలనీలోని మినరల్ వాటర్ ప్లాంట్ ను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. తెలుగుదేశం యువ నాయకుడు కురువ రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా శబరి వాటర్ ప్లాంట్ కు పూజలు చేసి ప్రారంభించారు వాటర్ ప్లాంట్ దగ్గర ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు అనంతరం శుద్ధ జలాన్ని బిందెలతో నింపి మహిళలకు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకెలుతుందని, నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతున్నామని ఆమె అన్నారు. పాములపాడు లోని ఎస్. సి కాలనీలో రూ. 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం ప్రజలకు నెర వేరుస్తుందన్నారు అలాగే రాష్ట్రాభివృద్దికి దోహదపడే విధంగా సీఎం చంద్రబాబు పరిశ్రమల పై ప్రత్యేక దృష్టి సారించి గూగుల్ సంస్థను విశాఖకు తీసుకువస్తున్నారనీ, ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలతో భేటీ అయ్యి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు సృష్టించి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చంద్రబాబు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తున్నాయని ఆమె వివరించారు. విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేలా ఉందనీ, దేశంలోనే అత్యుత్తమమైన 26 పాలసీలను రూపొందించి సంస్థల నిర్మాణానికి వేగంగా అనుమతులు, భూముల కేటాయింపు నుంచి పవర్ సప్లై వరకు ఒక్క అడ్డంకి లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ ఉమ్మడి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, సమర్ధవంతమైన నాయకత్వం ఉండడంతో రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్, ఆక్సెంచర్ వంటి టెక్ దిగ్గజాలు వస్తున్నాయని, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడులు కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిని 16 నెలలోనే వచ్చిన పెట్టుబడులు అధికంగా రావడం జరింగిందిని, ఈ 16 నెలల్లో రాష్ట్రానికి . 11.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 9.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించాయని, గూగుల్ కంపెనీ రాకతో యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు యువతలో అందనున్నాయని, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా, వారి అభివృద్ధికి బాటలు వేసేలా, యువతను ఒక బలమైన శక్తిగా మార్చేందుకు ఇటువంటి సంస్థలను రాష్ట్రానికి లోకేష్ సీఎం చంద్రబాబు, మంత్రి తీసుకువస్తున్నారని, అధునాతన టెక్నాలజీని విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు అందించాలని నైపుణ్య శిక్షణ కేంద్రాలతో పాటు వచ్చే విద్య సంవత్సరం నుండి పాఠ్యాంశాల్లో ఏఐ పాఠ్యాన్ని చేర్చనున్నారని, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ మొన్న అమరావతికి క్వాంటం వ్యాలీని తీసుకువచ్చి, నేడు విశాఖకు గూగుల్ ను తీసుకురావడం జరిగిందని, ఇవి రాష్ట్రాభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతాయని, హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రావడంతో టెక్ అభివృద్ధికి ఎలా గేమ్ చేంజర్ అయిందో, అలా ఇప్పుడు గూగుల్ విశాఖపట్నం కు రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి గేమ్ చేంజర్ మారనుందని, రూ.55 వేల కోట్ల పెట్టుబడితో సౌత్ ఆశియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ ను నిర్మించబోతోందనీ, రాష్ట్రాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు అనంతరం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు . ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సుభద్రమ్మ ఎంపీడీవో ఎం చంద్రశేఖర్ ఎస్సై కే సురేష్ బాబు సిఐ సురేష్ కుమార్ రెడ్డి , సర్పంచ్ మేకల భాగ్యమ్మ టైలర్ వెంకటస్వామి, కలబండి బాలస్వామి వాడలత్యాగరాజు చెరుకు అశోక్ రత్నం బరిగెల తిమ్మయ్య టీడీపీ నాయకులు గాండ్ల రవి, గాండ్ల సురేష్ , కె.వెంకటేశ్వర్లు, టేకూరి సాయి, అన్వర్ భాష, ఎం,రాజశేఖర్, కురువ ఎల్లయ్య, సీనియర్ టీడీపీ నాయకుడు,సాయికుమార్, మిట్టకందాల చింతల కుమార్ మురళీమోహన్, జనసేన రాము, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!