ANDHRA PRADESHCRIME NEWSPROBLEMS

వైసీపీ నాయకుడి నిర్వాకం ప్రభుత్వ భూమిలో అక్రమంగా  జగనన్న ఇల్లులు

వెల్దుర్తి ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 247లో వైసీపీ నాయకుడి అక్రమాలు

వైసీపీ నాయకుడి నిర్వాకం ప్రభుత్వ భూమిలో అక్రమంగా  జగనన్న ఇల్లులు

వెల్దుర్తి జూన్ 29 యువతరం న్యూస్:

అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించింది కాకుండా ఆక్రమించిన భూమిలో జగనన్న ఇల్లు నిర్మించిన సంఘటన మండల కేంద్రమైన వెల్దుర్తిలో చోటు చేసుకుంది. తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 247 లో వెల్దుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ మరిది వైసిపి నాయకుడు డొంక మరియు రోడ్డును ఆక్రమించుకొని ఒకటి కాదు రెండు జగనన్న ఇళ్లను నిర్మాణం చేయడం జరిగింది. రెండు ఇళ్ల నిర్మాణం చేసి ఒక ఇంటిగా మార్చి ఐసిడిఎస్ ప్రభుత్వ కార్యాలయానికి దాదాపు 8వేల రూపాయలకు అద్దెకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ స్థలంలో జగనన్న ఇళ్ల నిర్మాణం చేయడమే కాకుండా ఆ ఇళ్లకు కూడా పన్నులు సృష్టించుకోవడం మన వైసీపీ నాయకుడి గొప్పతనం. పంచాయితీ కార్యాలయం తమ చెప్పు చేతుల్లో ఉండడంతో ఇష్టానుసారంగా పన్నులు సృష్టించుకున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. మరి సంబంధిత రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. ప్రభుత్వ స్థలంలో జగనన్న ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారన్నది మరో ప్రశ్న. ఈ ప్రభుత్వ స్థలంలో జరిగిన అక్రమాలపై సంబంధిత అధికారులు నేటికైనా విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని వెల్దుర్తి పట్టణ ప్రజలు కోరుతున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!