ANDHRA PRADESHCRIME NEWSPROBLEMS

వెల్దుర్తి మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మరిది అయిన వైసీపీ నాయకుడి లీలలు

స్వీపర్ అవతారమెత్తిన వైసిపి నాయకుడు, నెల,నెల జీతం ప్రభుత్వం నుండి జీతం స్వాహా

వెల్దుర్తి మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మరిది అయిన వైసీపీ నాయకుడి లీలలు

వెల్దుర్తి జూన్ 29 యువతరం న్యూస్:

మండల కేంద్రమైన వెల్దుర్తి మేజర్ పంచాయతీలో సర్పంచ్ మరిది వైసిపి నాయకుడు లీలలు అంత, ఇంత కాదయ్యా అని వెల్దుర్తి పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వైసీపీ నాయకుడు తనతో పాటు మరికొందరిని స్వీపర్ల అవతారం ఎత్తించాడు. ఏనాడు చీపురు పట్టి మేజర్ పంచాయతీ వెల్దుర్తిలో ఊడ్చింది లేదు, ఏనాడు పార పట్టి కాలువలు శుభ్రం చేసింది లేదు. కానీ నెలల పాటు ప్రభుత్వ సొమ్మును అప్పనంగా జేబులోకి పెట్టుకోవడం సర్పంచ్ మరిది వైసిపి నాయకుడికే చెల్లింది. అంతేకాదు చేయని పనులకు లక్షల రూపాయలు బిల్లులు పెట్టుకొని పంచాయితీ నిధులను కొల్లగొట్టడం అతనికి చెల్లు అని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. పంచాయతీ కార్యాలయం అంటే ఆ వైసీపీ నాయకుడికి బంగారు బాతులా మారింది. ఏ అధికారైన అడిగితే వారిపై బూతు పురాణం ఆ వైసిపి నాయకుడికే చెల్లు. మేజర్ పంచాయతీ వెల్దుర్తిలో నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే నిధులు ఉండి కూడా పట్టించుకోకపోవడం వారికే చెల్లు. మేజర్ పంచాయతీలో దాదాపు పది నుండి 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం అంటే తీర్మానం పెట్టనివ్వడు ఆ వైసిపి నాయకుడు. తమకు ఆదాయం వస్తుందంటే మాత్రం తీర్మానం లేకుండానే అన్నీ నొక్కేస్తాడు ఆ వైసీపీ నాయకుడు అని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. వెల్దుర్తి మేజర్ పంచాయతీలో జరుగుతున్న గోల్మాల్ సంఘటనలను కర్నూలు జిల్లా పంచాయతీ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు మేజర్ పంచాయతీ కరణ సందర్శించి నిజాలను నిగ్గు తీర్చాలని వెల్దుర్తి పట్టణ ప్రజలు కోరుతున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!