ANDHRA PRADESHDEVOTIONALWORLD

నేటి నుండి రాంపల్లి లో శ్రీ కాశిరెడ్డి నాయన 20వ వార్షికోత్సవ వేడుకలు

నేటి నుండి రాంపల్లి లో శ్రీ కాశిరెడ్డి నాయన 20వ వార్షికోత్సవ వేడుకలు

శ్రీ కాశిరెడ్డి నాయనకి ప్రత్యేక పూజలు . ఏర్పాటు చేస్తున్న గ్రామ పెద్దలు

తుగ్గలి జూన్ 29 యువతరం న్యూస్:

తుగ్గలి మండలం పరిధిలోని రాంపల్లి గ్రామంలో ఈనెల 29 నుండి శ్రీ కాశిరెడ్డి నాయన 20వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నట్లు నిర్వహాకులు విలేకరులకు తెలిపారు. 29న ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ, శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజ, శ్రీ దత్తాత్రేయ స్వామి పూజ, శ్రీ అన్నపూర్ణేశ్వరి పూజ, శ్రీ కాశి నాయన స్వామి పంచామృతాభిషేకం జరుగుచున్నట్లు వారు తెలిపారు. మరియు ఉదయము 9 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము జరుగుతున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నము సాయంత్రము వివిధ కార్యక్రమాల నిర్వహిస్తున్నట్లు వారు. కాశిరెడ్డి నాయనా ఆరాధనకు 400 కేజీల లడ్డును రాంపల్లి పగడిరాయి సుంకన్న కుమారుడు చిన్న లాలప్ప ( హైదరాబాద్) ఇచ్చినట్లు వారు తెలిపారు. అదేవిదంగా 122 గోమాతలను కర్నూలు జిల్లా గోనెగుండ్ల మండలం చిన్న మారేడు గ్రామానికి చెందిన పెద్ద నాగన్న కాశిరెడ్డి ఆశ్రమానికి గోవులను ఇచ్చినట్లు వారు తెలిపారు. రాత్రి 8 గంటలకు డోన్ రవితేజ టీం డి స్టూడియో ఈవెంట్స్ వారిచే డాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పై పూజ కార్యక్రమాలకు హాజరై స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని వారు కోరారు. రాంపల్లి కి చెందిన చిన్న లాలప్ప 400 కేజీల లడ్డును ఇవ్వడంతో అక్కడే ఏర్పాట్లు గ్రామ పెద్దలు నిర్వహించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!