ANDHRA PRADESHDEVOTIONALWORLD

రికార్డు స్థాయిలో శ్రీ మఠం హుండీ ఆదాయం

రికార్డు స్థాయిలో శ్రీ మఠం హుండీ ఆదాయం

మంత్రాలయం ప్రతినిధి జూన్ 26 యువతరం న్యూస్:

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం నెల రోజుల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో మొదటి సారి వచ్చిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్. కె. శ్రీనివాసరావు తెలిపారు. జూన్ నెల లో భక్తులు స్వామి వారికి ముడుపులు రూపంలో నగదు రూ 5.28 కోట్లు, బంగారు 43 గ్రాములు, వెండి 1.87 కేజీల సమర్పించి మొక్కులు తీర్చుకున్నారని సమకూరిన నగదును శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ మఠం అభివృద్ధి కి వినియోగిస్తామని మేనేజర్ తెలిపారు.. రోజు రోజుకు భక్తులు అధిక సంఖ్యలో శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకునేందు వస్తున్నారని మరియు రెండోవ తిరుపతిగా శ్రీమఠం కొనసాగుతుందని మేనేజర్ తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!