కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం తమ వారికే కేటాయించుకునేందుకు ఎంపీ ముమ్మర ప్రయత్నాలు

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం తమ వారికే కేటాయించుకునేందుకు ఎంపీ ముమ్మర ప్రయత్నాలు
చైర్మన్ పదవిని సుజాత కు ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు ని కలిసిన ఎంపీ
కర్నూలు రూరల్ జూన్ 25 యువతరం న్యూస్:
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని తాను ప్రతిపాధించిన వారికే ఇప్పించుకోవడానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు నగరంలోని 40 వ మున్సిపల్ వార్డు టిడిపి ఇంచార్జి కురువ చంద్రశేఖర్ సతీమణి సుజాత పేరును ఆయన ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే చైర్మన్ పదవి రేసులో పలువురు పోటీ పడుతున్న తరుణంలో మార్కెట్ చైర్మన్ పదవిని ఎలాగైనా సుజాతకు వచ్చేలా ఎంపీ నాగరాజు ప్రయత్నలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సుజాత భర్త చంద్రశేఖర్ తో కలిసి ఎంపీ విజయవాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుని కలిశారు. ఈ సందర్బంగా మార్కెట్ చైర్మన్ పదవిని సుజాతకు కేటాయించాలని మంత్రిని ఎంపీ నాగరాజు కోరారు.