ANDHRA PRADESHOFFICIAL
వెల్దుర్తిలో యోగాంధ్ర ర్యాలీ

వెల్దుర్తిలో యోగాంధ్ర ర్యాలీ
వెల్దుర్తి జూన్ 10 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన వెల్దుర్తిలో యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎంపీడీవో సుహాసినమ్మ, హోమియోపతి డాక్టర్ భారతీదేవి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బరాయుడు, బలరాం గౌడ్, రమాకాంత్ రెడ్డి, సుధాకర్ గౌడ్, రాఘవేంద్ర, తహసిల్దార్ చంద్రశేఖర వర్మ, డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్, జడ్పిటిసి సుంకన్న, ఎంఈఓ రమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మునయ్య, ఏపీవో లక్ష్మన్న, ఏపిఎం అనురాధ, మురళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.