ANDHRA PRADESHCRIME NEWS
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
వెల్దుర్తి జూన్ 2 యువతరం న్యూస్:
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 పై చెరుకులపాడు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. క్రిష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామానికి చెందిన సురేష్, బాలు అనే ఇరువురు మోటార్ బైక్ పై వెళుతూ చెరుకులపాడు వైపు హైవేలో తిరిగారు. డోన్ వైపు నుండి వస్తున్న కంటైనర్ డి కొనడంతో సురేష్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. బాలు ఉరఫ్ ప్రహ్లాద కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.