ANDHRA PRADESHJOURNALISTWORLD

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు

నంద్యాల బ్యూరో మే 31 యువతరం న్యూస్:

రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జి. రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గతంలో రెన్యువల్ చేసిన అక్రిడేషన్ కాల పరిమితి మే 31వ తేదీ నాటికి ముగుస్తున్న నేపథ్యంలో మీడియా అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగిస్తున్న‌ట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం మే 31 నాటికి అక్రిడిటేషన్ కార్డులు పనిచేస్తున్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు జూన్ 1, 2025 నుండి ఆగష్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!