ANDHRA PRADESHBREAKING NEWSWORLD

మన జెండా పీకేస్తాం అన్నోళ్లు అడ్రస్ లేకుండా పోయారు

విషమద్యంతో 30వేలమంది అమాయకులను బలిగొన్నారు

విధ్వంస పాలనతో అన్నపూర్ణను అప్పులప్రదేశ్ గా మార్చేశారు!

మన జెండా పీకేస్తాం అన్నోళ్లు అడ్రస్ లేకుండా పోయారు

ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడే పసుపుసైన్యమే మనబలం

తెలుగుజాతిని ప్రపంచపటంలో నిలిపిన సిబిఎన్ బ్రాండ్

తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్న ఎన్టీఆర్

ఏడాదిలోనే రూ.8.5లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం

ప్రభుత్వ కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదు

కడప మహానాడు వేదికపై యువనేత నారా లోకేష్ సింహగర్జన

కడప ప్రతినిధి మే 29 యువతరం న్యూస్:

వైసిపి విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారు, ఒక్క కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయి, అంతులేని ధనదాహంతో విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని ఏరులై పారించి 30వేలమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు, వేలకోట్లు దోచుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్లిపోయారని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప మహానాడు వేదికపైనుంచి లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలనుద్దేశించి యువనేత లోకేష్ మాట్లాడుతూ… మనకి అధికారం కొత్త కాదు , ప్రతిపక్షం కొత్త కాదు. కానీ 2019 నుండి 2024 వరకూ విధ్వంస పాలన ఎదుర్కొన్నాం. ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్ట్. మన అధినేతను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. నాయకులు, కార్యకర్తల పై వేల కేసులు, అరెస్టులు జరిగాయి. నాయకులు, కార్యకర్తల పై దాడులు చేసారు, హత్యలు చేసారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రత్యర్ధులు దాడి చేస్తున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత మన దమ్ము. గొడ్డలి తో దాడి చేసినా, కత్తులదాడిచేసి తల నుండి రక్తం కారుతున్నా ఈవిఎం మెషిన్కు సీల్ వేసే వరకూ పోలింగ్ బూత్ లో కూర్చున్న మంజులా రెడ్డి మన ధైర్యం. కత్తి మెడ పై పెట్టి వాళ్ళ నాయకుడి కి జై కొట్టమంటే జై చంద్రబాబు జై టిడిపి అన్న చంద్రయ్య మన స్ఫూర్తి. అరాచకులపై పోరాడి కంటిచూపు కోల్పోయిన చెన్నుపాటి గాంధీనే మనకు ప్రేరణ. ప్రాణాలను ఫణంగా పోరాడే పసుపు సైన్యమే మనబలం.

కడప మాస్ జాతర అదిరిపోయింది:

తిరుమల తొలిగడప దేవుని కడప… ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, అమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చి నెలకొన్న పుణ్యభూమి కడప. పౌరుషం, ఆత్మీయతలను కలగలిపి మహిళలను గౌరవించి గొప్పనేల కడప. కడప మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు సైన్యం గర్జించింది, దేవుని గడప కడపలో పసుపు పండగ జరుపుకోవడం మన అదృష్టం. 2024లో మాస్ విక్టరీ సాధించాం, రికార్డులు బద్దలు కొట్టాం… చరిత్రను తిరగరాసాం. 94 పర్సెంట్ స్ట్రైక్ రేట్…164 అవుటాఫ్ 175. ఇది కేవలం రికార్డ్ కాదు ఆల్ టైం రికార్డ్. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటుదెబ్బ. జెండా పీకేస్తాం అన్నారు … పార్టీ కార్యాలయానికి టు లెట్ బోర్డు పెట్టుకున్నారు. పార్టీ లేకుండా చేస్తామన్నోళ్లు అడ్రెస్స్ లేకుండా పోయారు. వై నాట్ 175 అన్నారు … ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేసారు… ఎన్నికల్లో ప్రజలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఏ తప్పు చేయని మన అధినేతను అరెస్ట్ చేసారు… ప్రజలు వాళ్ళ నాయకుడిని ప్యాలస్ లో పెట్టి తాళం వేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కి, గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, 82 బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుండి 2025 బ్యాచ్ జూనియర్లకు, ప్రజలకు, అందరి కంటే ముఖ్యం, ఎత్తిన జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్నప్రాణసమానమైన కార్యకర్తలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

దేవుని గడప సాక్షిగా ప్రజలకు 4ప్రశ్నలు:

దేవునికడప సాక్షిగా ఇక్కడి ప్రజలను నాలుగు ప్రశ్నలను అడగాలనుకుంటున్నా. 1). తల్లిని చెల్లిన మెడబట్టి బయటకు గెంటిదెవరు? 2). సొంత బాబాయిని గొడ్డలిపోటుతో లేపేసిందెవరు? 3). జె-బ్రాండ్స్ తో పేదల రక్తం తాగిందెవరు? 4). బల్లకింద రెడ్ బటన్ నొక్కి ప్రజలను బాదిందెవరు?

ఆరుశాసనాలే మన శ్వాస:

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్నారు అన్న ఎన్టీఆర్. అందుకే మనం ఆరుశాసనాలు తీసుకున్నాం. కడప మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆరుశాసనాలను పొలిట్ బ్యూరో సభ్యుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు శ్వాసగా భావించి చిత్తశుద్ధితో అమలుకు కృషిచేయాలి. 1). తెలుగుజాతి – విశ్వఖ్యాతి, పేదలసేవలో – రీఇంజనీరింగ్, స్త్రీశక్తి,, యువగళం, అన్నదాతకు అండగ, కార్యకర్తే అధినేత. మనకు రాష్ట్రప్రజలు, ప్రజల ముఖాల్లో చిరునవ్వు, వారి సంతోషమే ముఖ్యం. ఇందుకోసం అహర్నిశలు కష్టపడి ప్రజల మనసు గెలుద్దాం. సమస్యలుంటే ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలి. స్థానికంగా సాధ్యం కాకపోతే మా దృష్టికి తీసుకువస్తే మేమే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజమండ్రి జైలులో చంద్రబాబును చూసినపుడు చాలా బాధేసింది. అలిపిరిలో ఆయనను చంపేందుకు బాబు పేల్చారు. ప్రజలకు అండగా నిలచేందుకు భగవంతుడు ఆయనను ఈనాడు మన ముందుంచారు.

సిబిఎన్ అంటే ఒక బ్రాండ్:

తెలుగు వారిని ప్రపంచ పటంలో పెట్టింది మన బ్రాండ్ సిబిఎన్. అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ. అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు సైబరాబాద్ ఇప్పుడు అమరావతి. అప్పుడు రూ.200 పెన్షన్ ను రూ. రెండు వేలు చేసింది మన సిబిఎన్…ఇప్పుడు పెన్షన్ ను రూ.నాలుగు వేలు చేసింది మన సిబిఎన్. అన్న క్యాంటిన్లు, డ్వాక్రా, దీపం, పేదల చిరునవ్వు మన సిబిఎన్. సిబిఎన్ అంటే డెవెలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మానవత్వం. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయనే లెజెండ్. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు.

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్:

పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం, అభివృద్ధి పరిచయం చేసింది ఎన్టీఆర్. రూ.2 కే కిలో బియ్యం, పెన్షన్, రూ.50 కే హార్స్ పవర్ విద్యుత్, జనతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజన పధకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారి విధానం రద్దు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు. అభివృద్ధి అయినా, సంక్షేమం అయినా ఎన్టీఆర్ ఒక బ్రాండ్. తెలుగువారి ఆత్మగౌరవం విశ్వ విఖ్యాత, నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు.

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే కూటమి ఏర్పాటు:

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కూటమి ఏర్పడింది. ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ , జనసేన అధినేత పవనన్న, మన చంద్రన్న జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి కలిసి పనిచేసారు. ప్రజలు కూటమిని ఆశీర్వదించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తున్నాం. పూర్తిగా బెడ్ కే పరిమితం అయిన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. నేను ఈ వేదిక మీద నుండి వైసిపి వాళ్ళను ప్రశ్నిస్తున్నా వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి మీకు ఎన్ని ఏళ్ళు పట్టింది? 5 ఏళ్ళు పట్టింది. దీపం పథకం లో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లు తెరిచాం. పేద వాళ్లు కడుపునిండా భోజనం చేయడం కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు అందుకే అప్పుడు అన్న క్యాంటిన్లు మూసేసారు.

త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ:

త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తాం. 16,347 పోస్టులతో మెగా డీఎస్సి నిర్వహిస్తున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తున్నాం. రాయలసీమ ను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టీ కల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. ప్రకాశం జిల్లా లో రిలయన్స్ సిబిజి ప్లాంట్లు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా అభివృద్ధిచేస్తున్నాం. ఉత్తరాంధ్ర లో ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయి. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇప్పటికే రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడి వాటి ద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నాం. యువగళం పాదయాత్ర సమయంలో రాయలసీమ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశాక ఈ కడపగడ్డపైనే మిషన్ రాయలసీమ ప్రకటించా. అప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా కూటమికి సహకరించారు. వారి సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తాం.

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత:

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం టీడీపీ కార్యకర్తలకు ఇస్తుంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కోటి మంది సభ్యులు లేరు. సభ్యత్వం లో కూడా మన రికార్డులు ఎవ్వరూ బ్రేక్ చెయ్యలేరు. 5 లక్షల ప్రమాద భీమా అందిస్తుంది ఒక్క టీడీపీ మాత్రమే. ఫ్యాక్షన్ లో చనిపోయిన కార్యకర్తలు పిల్లలు ఫ్యాక్షన్ వైపు వెళ్ళకూడదని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి చదివించింది మన సిబిఎన్. విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఇలా రూ.140 కోట్లు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేసింది టిడిపి. నేను స్వయంగా వైసిపి బాధిత కార్యకర్తల కుటుంబాలను కలుస్తున్నాను. వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నా. వారికి పార్టీ అండగా ఉంటుంది.

పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం:

నామినేటెడ్ పదవులు అన్ని ఒక్క పద్ధతి ప్రకారం ఇస్తున్నాం. మన అధినేత చంద్రబాబు గారు, నేను ఏ ప్రభుత్వ కార్యక్రమం పెట్టుకొని జిల్లాలకు వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం ముందు ఉత్తమ కార్యకర్తలు, ఆ తరువాత కార్యకర్తలను కలిసిన తరువాతే ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. నేను సీనియర్ల ను, జూనియర్స్ ను గౌరవిస్తాను. కానీ పనిచేసేవారినే ప్రోత్సహిస్తా. ప్రతి కార్యక్రమం లో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లో చర్చ చెయ్యాలి. అధికారంలో ఉన్నప్పుడు కాదు… ప్రతిపక్షంలోనూ జగన్ ను వాళ్ళ నాయకులు, కార్యకర్తలు కలవలేరు. కార్యకర్తల కోసం మా ఇంటి ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. నో.. డోర్స్ క్లోజ్డ్. అది వైసిపి కి టిడిపి కి తేడా.

రాష్ట్రం కోసం కలిసే ముందుకు సాగుతాం:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాని మోడీ మన రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మనం అడిగిన ప్రతి కోరిక తీరుస్తున్నారు. మనకు అహంకారం ఉండకూడదు, అహంకారం విర్రవీగిన గత పాలకుల 151 సీట్లు 11 అయ్యాయి. అందుకే నేల మీద ఉండి ప్రజలకు సేవ చెయ్యాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పనిచేయాలి. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. కూటమి అన్న తరువాత చిన్న చిన్న సమస్యలు ఉండటం సహజం. ఇగో లు పక్కన పెట్టి అందరిని కలుపుకొని పనిచేయాలి. రాసిపెట్టుకోండి విడాకులు ఉండవు. రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే మనం కలిసి ఉండాల్సిందే.

ప్రభుత్వ కొనసాగింపుతోనే ప్రగతి:

మహానాడు వేదికగా నేను ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. గవర్నమెంట్ కంటిన్యుటీ, ప్రభుత్వ కొనసాగింపు కొనసాగింపు ముఖ్యం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. కట్టుబట్టలతో బయటకు వచ్చి 14 నుండి 19 వరకూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. 2019లో ప్రభుత్వం మారడంవల్ల, ఒక సైకో ముఖ్యమంత్రివల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయి 30 ఏళ్ళు వెనక్కి పోయింది. అదే 19- 24 వరకూ మన ప్రభుత్వం కొనసాగి ఉంటే ఎటువంటి అభివృద్ధి జరిగేదో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి. గుజరాత్ లో బీజేపీ వరుసగా 7 సార్లు గెలిచింది. ఒకే ప్రభుత్వం ఉండటం వలన గుజరాత్ ఎలా అభివృద్ధి చెందిందో చూడండి. ఒడిశాలో బిజూ జనతాదళ్ వరుసగా ఐదు సార్లు గెలిచింది. ఆ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి చంద్రబాబు గారి నేతృత్వంలో ఒకసారి వరుసగా రెండుసార్లు విజయం సాధించాక ఎంతటి అభివృద్ధి సాధించిందో మీకందరికీ తెలుసు. అందుకే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా ముఖ్యం. దీని గురించి రాష్ట్రవ్యాప్త చర్చజరగాలి. ప్రభుత్వ కొనసాగింపు ఉంటే పెట్టుబడి పెట్టే వారికి నమ్మకం ఉంటుంది. మన యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

రెడ్ బుక్ అంటే ఏమిటో అర్థమైందా రాజా:

రెడ్ బుక్ పేరుచెప్పగానే ఒకడికి గుండెపోటు వచ్చింది, మరొకడు బాత్రూమ్ లో కాలిజారిపడ్డాడు, ఇంకొకడు ఏమయ్యాడో మీరందరికీ తెలుసు, అర్థమైందా రాజా? రెడ్ బుక్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుచేయడమే. అంతా రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఏడుస్తున్నారు. ఎవరైతే చట్టాలను ఉల్లఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం అని చెప్పాను. ఇప్పుడు రెడ్ బుక్ అదే చేస్తుంది. రెడ్ బుక్ కాదు రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదు. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేసిన తప్పులను ఎస్టాబ్లిష్ చెయ్యాలి. దానికి సమయం పట్టొచ్చు. కానీ శిక్ష తప్పదు. ఎవ్వరూ తప్పించుకోలేరు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు మనం అంతా డెవెలప్మెంట్ బుక్ మీద దృష్టి పెట్టాలి. మనకి ప్రజలు ముఖ్యం , వారి సంతోషం ముఖ్యం. వాళ్ళు చేసిన తప్పులు మనం చెయ్యకూడదు. అనవసరమైన కామెంట్స్ వద్దు. వాళ్ళని ఒక్క మాట కూడా అనొద్దు. వాళ్ళకి మనకి తేడా ప్రజలు గమనించారని యువనేత నారా లోకేష్ అన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!