STATE NEWSTELANGANA

27న ఇంద్రపార్క్ వద్ద నిరాహార దీక్షను విజయవంతం చేయండి

27న ఇంద్రపార్క్ వద్ద నిరాహార దీక్షను విజయవంతం చేయండి

తెలంగాణ ఉద్యమకారుడు మంతూరి ఆంజనేయులు

మేడ్చల్ ప్రతినిధి మే 25 యువతరం న్యూస్:

తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా 27వ తేదీ రోజున ఒకరోజు నిరాహార దీక్షను తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మంతూరి ఆంజనేయులు అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని తన మేనిఫెస్టో లో పెట్టుకొని ఇప్పటివరకు కూడా ఉద్యమకాలకు న్యాయం చెయ్యలేదని న్యాయం చేయడంలో విఫలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిందని ఆంజనేయులు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను పరిశీలించి ఇచ్చిన హామీలను ఇచ్చిన మాటను అమలు చేయాలని. తెలంగాణ ఉద్యమకారుడు. అంబేద్కర్ పూలే మహాజన సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మంతూరి ఆంజనేయులు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ.ఆధ్వర్యంలో ఇంద్రపార్క్ వద్ద ఒక్కరోజు దీక్షను పిలుపునివ్వడం జరిగింది. కావునా తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తొలిదశ ఉద్యమకారులు విద్యార్థులు మేధావులు మహిళలు కవులు కళాకారులు పాల్గొని. ఒక్కరోజు దీక్షను విజయవంతం చేయాలని కోరారు.. శాంతియుతంగా తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదని మండిపడ్డారు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగరహారం. సకలజనుల సమ్మె. రైల్ రోకో..వంటవార్పు.. బోనాలు బతుకమ్మలతో ధర్నాలు.. పోరాటాలు ఇచ్చినటువంటి ఘనత ఉద్యమకారులకు ఉంది అని మర్చిపోవద్దని అన్నారు ఉస్మానియా గడ్డపై ఉద్యమాలు చేస్తున్న క్రమంలో ఎన్నో ఆటుపోట్లకు ఎదురోడ్డి ఎంతోమంది విద్యార్థులు యువకులు మహిళలు ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారులని గుర్తించకుండా ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు తమ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని నమ్మ బలికీనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమైందని ఆంజనేయులు అన్నారు.. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులని గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని వారు కోరారు లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం కోసం బరగిసి కొట్లాడినటు పంటి ఉద్యమ స్ఫూర్తితో మరో ఉద్యమం మొదలు పెట్టాల్సిన అవసరం వస్తుందని అంబేద్కర్ పూలే మహాజన సంఘం వ్యవస్థాపక జాతియా అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు మంతూరి ఆంజనేయులు ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!