ANDHRA PRADESHEDUCATION

పూర్వ విద్యార్థుల అపురూప కలయిక

పూర్వ విద్యార్థుల అపురూప కలయిక

వెల్దుర్తి మే 25 యువతరం న్యూస్:

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు అన్వర్ భాష, గణిత ఉపాధ్యాయులు ప్రభు చరణ్, శ్రీనివాస్ రెడ్డి ,రమాదేవి, శ్రీనివాస్ కుమార్, ఎండి కృష్ణయ్య ,పి ఈ టి. మెహబూబ్ భాష, కృష్ణమూర్తి లు మాట్లాడుతూ పూర విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి కు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 1996- 2001 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల అనంతరం కలుసుకోవడం అనేది చారిత్రాత్మక విషయమని వారన్నారు .ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల విద్యార్థులను అభినందించారు.ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది చాలా సంతోషం అన్నారు .చదువుకున్న రోజుల్లో జరిగిన గుర్తులను తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే పూర్వ విద్యార్థులు తమ గురువుల దగ్గర చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.అనంతరం గురువులకు పూల మాలలు శాలువలు తో సత్కరించి కేక్ కట్ చేసి మెమెంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విద్యార్థినిలు సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!