ANDHRA PRADESHSTATE NEWS

ముమ్మిడివరంలో పసుపు పండగ

ముమ్మిడివరంలో పసుపు పండగ

మినీ మహానాడు విజయవంతం

అమలాపురం ప్రతినిధి మే 21 యువతరం న్యూస్:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం విష్ణాలయం సెంటర్ డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్ లో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన మినీ మహానాడు సమావేశం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన తరువాత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు, 2024-25 ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కి అంకితభావంతో పార్టీకి సేవ చేసి మరణించిన నాయకులు కు సంతాపం తెలియజేశారు, అలాగే ఆపరేషన్ సింధూర్ లో అమరులైన వీర జవాన్లకి సమావేశం ఘన నివాళులు అర్పించారు, సభను ఉద్దేశించి ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ సభ ముందు ప్రవేశపెట్టిన తీర్మానాలు ఐలాండ్ చుట్టూ 323 కోట్ల రూపాయలతో ఏటిగట్టు బలోపేతం మరియు రోడ్డు నిర్మాణం, 18 కోట్ల రూపాయలతో లంక ఆఫ్ తానే లంక వివేకానంద వారధి వద్ద ఇరువు ప్రక్కల గ్రోయన్స్ వర్క్, 230 కోట్ల రూపాయలతో కునాలంక, గురజాపులంక, సలాది వారి పాలెం మరియు మురమళ్ళ గ్రోయన్స్ వర్క్, 40 కోట్ల రూపాయలతో భైరవపాలెం ముల్లేటి మొగ, పల్లం, బలిసితిప్ప గ్రామాలలో ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిలు వెడల్పు చేయడం, 72 కోట్ల అంచనాలతో జి మూలపాలం 44 కోట్ల అంచనాతో గోగుల్ లంక గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం , యానం నుండి జొన్నాడ N H రోడ్డు వరకు ఏటిగట్టు వెడల్పు, ముమ్మిడివరం కాట్రేనికోన వయా అయినాపురం ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం, జి వేమవరం టు గొర్రిపూడి ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం, చంద్రన్న బీమా పునర్ ప్రారంభించాలి,2014-19 మధ్యలో నిర్మించుకున్న గృహాల వారికి మరియు వివిధ అభివృద్ధి పనులు చేసిన వారికి పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలి, రైతులకు ఉపయోగపడే పుంత రోడ్లు , కాలవ గట్లు మార్కెట్ కమిటీ మరియు N REGS నిధులతో గ్రావెల్ రోడ్లు నిర్మించాలని తీర్మానాలని మినీ మహానాడులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన కుటమి ప్రభుత్వంలో చేపట్టామని దీనిలో భాగముగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4000 రూపాయలకు పెంచామని దీని ద్వారా ముమ్మిడివరం నియోజవర్గంలో 40,932 మంది లబ్ధిదారులకు 17 కోట్ల 24 లక్షలు రూపాయలు పెన్షన్ రూపంలో పంపిణీ చేయడం జరిగింది, నియోజకవర్గ పరిధిలో సుమారు 30 కోట్ల రూపాయలతో 196 సిసి మరియు డ్రెయిన్ లు నిర్మాణం చేస్తున్నారు, సుమారు మూడు కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్లు మరమ్మత్తు మరియు కొత్త రోడ్లు నిర్మాణం. గత ప్రభుత్వం మూసి వేయించిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి రోజు వందలాది మంది పేదవారికి ఆహారం అందిస్తున్నాం, నియోజకవర్గంలో ఇంజరం వద్ద మూడు కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్డు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం , నియోజకవర్గ పరిధిలో 25 కోట్ల రూపాయలతో 37 ప్రదేశాలలో రక్షిత మంచినీటి ట్యాంకులు మరియు పైపులైన్లు నిర్మాణం, 161 కోట్ల ఏఐఐబి నిధులతో ముమ్మిడివరం నగర పంచాయతీలో సమగ్ర మంచినీటి సరఫరా కార్యక్రమం, ఓఎన్జిసి నష్టపరిహారం కింద చేపల వేట మీద ఆధారపడిన సుమారు 20వేల మందికి 133 కోట్ల పంపిణీ, విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం కార్యక్రమం, అన్నదాత సుఖీభవ జూన్ లో రైతుల ఖాతాలో జమ,ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రారంభిస్తాం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, చిక్కాల రామచంద్రరావు,నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, గొల్ల కోటి దొరబాబు, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, టేకుమూడి లక్ష్మణరావు, మోకా ఆనంద సాగర్ , దాట్ల పృధ్వీరాజ్ ,మందాల గంగ సూర్యనారాయణ, అర్ధాన్ని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణ కుమార్, గొల్లపల్లి ధర్మారావు, వాడ్రేవు వీరబాబు, నడింపల్లి సుబ్బరాజు, రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు, పొనమండ రామలక్ష్మి, దూలిపూడి బాబి, ములపర్తి బాలకృష్ణ, ఆకాశం శ్రీను,చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, కడలి నాగు, కట్ట సత్తిబాబు, అడబాల సతీష్ కుమార్, దివి మహాలక్ష్మి , సాగిరాజు సూరిబాబు రాజు, రామలింగరాజు, కాకర్లపూడి రాజేష్, యాళ్ల ఉదయ్, పిల్లి నాగరాజు, దండుప్రోలు సత్యం,రెడ్డి సుధీర్ ,కురసాల శివ, విల్ల వీరస్వామి నాయుడు, నిమ్మకాయల విషు, మిమ్మితి చిరంజీవి, దంగేటి శ్రీను, ఇసుక పట్ల వెంకటేశ్వరరావు, పుల్లాం రాజు ,సరిపెల్ల శ్రీను రాజు,కాశి లాజర్, బొక్కా రుక్మిణి, మెండి కమల, వాసంశెట్టి అమ్మాజీ, పెదపూడి రుక్మిణి, బీర సత్య కుమారి ,రూప, భాస్కర రాజు, మోపురి వెంకటేశ్వరరావు, కట్ట త్రిమూర్తులు,కొండేటి వెంకటలక్ష్మి, కుడిపూడి మల్లేశ్వరి, ప్రసన్న, యోగేశ్వరి, నీతిపూడి వంశీ, కాశి రామచంద్రరావు, బొంతు నాగరాజు, బొంతు శ్రీరాములు, మట్ట రాహుల్ ,రవి,కొత్తూరు కాశి, రెడ్డి శ్రీను, దివి విజయ్, గోదాసి గణేష్, కుంచనపల్లి నారాయణరావు, దాట్ల బాబు, బూరుగు కళ్యాణ్, చప్పిడి ప్రసాద్, ఎలమంచిలి రాజా, రామ్ చరణ్ రామ్ కిరణ్, చింతలపూడి కొండబాబు, రంకి రెడ్డి రాంబాబు, జాగు సత్తిబాబు, కంచర్ల సురేష్, మొదలగు వారు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!