బేతంచర్ల, వెల్దుర్తి మండలాలలో అక్రమ ఐరన్ మైనింగ్

బేతంచర్ల, వెల్దుర్తి మండలాలలో అక్రమ ఐరన్ మైనింగ్
యదేచ్చగా ఐరన్ తవ్వకాలు
అడపాదడప అధికారుల దాడులు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
రాత్రుల పూట లారీలలో తరలింపు….❓❓❓❓
వెల్దుర్తి మే 15 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం, నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలాలలో అక్రమ ఐరన్ మైనింగ్ యదేచ్చగా జరుగుతున్నట్లు ఆయా మండల ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వెల్దుర్తి మండలంలోని పిక్కిలివాని పల్లె సమీపంలో గల పొలాలలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా యదేచ్చగా అక్రమ ఐరన్ మైనింగ్ జరుగుతున్నట్లు ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నట్లు సమాచారం. అదేవిధంగా బేతంచర్ల మండలంలోని ముసలాయ చెరువు, తవిసికొండ, గూటు పల్లె, రేపల్లె, వెంకటగిరి గ్రామాల మధ్యన అక్రమ ఐరన్ మైనింగ్ జరుగుతున్నట్లు మండల ప్రజలు పేర్కొంటున్నారు. పొలాలలో పనిచేసి తీసిన అక్రమ ఐరన్ ను రవాణాకు అనుకూలమైన ప్రదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఎక్కడైనా సరే ప్రభుత్వ అనుమతులు లేకుండా పట్టా భూములలో గాని, ప్రభుత్వ భూములలో గాని అక్రమ ఐరన్ మైనింగ్ చేసుకునేందుకు ఎటువంటి అనుమతులు లేవు. కానీ కొందరు అక్రమార్కులు అధికారుల కళ్ళు కప్పి రాత్రింబవళ్లు అక్రమ ఐరన్ మైనింగ్ చేసి అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నట్లు సమాచారం. అడపాదడప సంబంధిత అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం. అయినా అధికారులు దాడులు చేస్తే మాకేంటి మా పని మేము చేసుకుంటూ వెళతామని నిరంతరాయంగా కొద్దిమంది అక్రమార్కులు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అక్రమ ఐరన్ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నట్లు సమాచారం. రాయల్టీలు గాని, వే బిల్లులు గాని అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి బిల్లులు లేకుండా రాత్రుల పూట లారీలలో అక్రమ ఐరన్ రాయి ని తరలిస్తున్నారని ప్రజల తెలుపుతున్నారు. సంబంధిత అధికారులు కల్పించుకుని అక్రమ ఐరన్ మైనింగ్ ను అరికట్టాలని ఆయా మండల ప్రజలు పేర్కొంటున్నారు.